– – – ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.
– – – గడిచిన ఐదు నెలల్లో మద్యం సేవిస్తూ వాహనం నడుపుతూ పట్టుబడ్డ 3200 మంది
– – – జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ .
నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గడిచిన ఐదు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 3200 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగిందని వీరికి కోర్టు ద్వారా జరిమానలు విధించడం జరిగిందని ఇందులో 7 గురు( 5 రోజులు ఇద్దరికి, 4 రోజులు నలుగురికి , 2 రోజులు ఒక్కరికీ ) వ్యక్తులకు జైలు శిక్షలు కోర్టు ద్వారా విదించడం జరిగిందని జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. ఒక వేల మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసు లు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

