Wednesday, March 11, 2026

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం..

నేటి సాక్షి, దేవరకద్ర జులై 13

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం ఆలంపల్లి లక్ష్మయ్య, బాల మనెమ్మ దంపతుల ఇంట్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ రీతిలో భక్తిశ్రద్ధలతో ఈ కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి దంపతులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అలంకరించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News