నేటి సాక్షి, రాయికల్ :
రాయికల్ పట్టణంలోని మార్కండేయ పంక్షన్ హాల్ లో ఆదివారం రాయికల్ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పోపా) సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోపా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా దాసరి రామస్వామి, అసోసియేట్ అధ్యక్షులుగా శ్రీపతి రాఘవులు, ఉపాధ్యక్షులుగా సామల్ల గంగాధర్, ఉపాధ్యక్షురాలిగా మాచర్ల స్వప్న, ప్రదాన కార్యదర్శిగా సిరిపురం మహేష్, సంయుక్త కార్యదర్శిగా సింగని రాందాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా దావనపల్లి సురేందర్, ప్రచార కార్యదర్శిగా ఉషకోల రాము, కోశాధికారిగా దాసరి కృష్ణహరి, కార్యవర్గ సభ్యులుగా కడకుంట్ల జగదీశ్వర్, చిలుక సత్యం, కడకుంట్ల అభయ్ రాజ్, దాసరి ఉమాదేవి, ఆడేపు సుజాత, కస్తూరి రేవతి, సాంస్కృతిక కార్యదర్శిగా బాలె దేవేందర్, క్రీడల కార్యదర్శిగా తాటిపాముల శ్యామ్ సుందర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల రమేష్, కట్కం భూమేశ్వర్, ఉదుత రమేష్, సింగని రమేష్, గాజింగి రాజేశం, ఎలిగేటి రాజకిశోర్, గుట్ట సత్యనారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





