నేటి సాక్షి అనంతగిరి
అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సూచనల మేరకు.. సూర్యాపేట జిల్లా అనంతగిరి
మండల కేంద్రంలోని తెలంగాణ శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో మూడవ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ మేరకు సుమారు 300 మంది అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములు బిక్ష గావించారు. యూఎస్ఏ దేవలపల్లి విజయసింహ దంపతుల అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారని ఆలయ చైర్మన్ గురుస్వామి కొండపల్లి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిరి వీరయ్య,ఐ వెంకటేశ్వర్లు,పి నరసింహారావు,కొండపల్లి వేణుగోపాల్,కాక్కిరేణి రామారావు, గాదం శ్రీను,స్వాములు తదితరులు పాల్గొన్నారు.





