నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని బంగారుగడ్డ 31 (వార్డు) కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జర్నలిస్ట్, నల్లగంతుల నాగభూషణం, తల్లి నల్లగంతుల మల్లమ్మ గురువారం సాయంత్రం వృద్ధాప్యంలో తుది శ్వాస విడిచారు. 27వ వార్డు శాంతినగర్ కు చెందిన వాలుగొండ రాములమ్మ నిన్న సాయంత్రం వృద్ధాప్యంలో తుది శ్వాస విడిచారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మిర్యాలగూడ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ మల్లమ్మ, రాములమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించారు. వారి వెంట సీనియర్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నభీమోజు నాగార్జున చారి, మగ్ధూం పాషా, వింజం శ్రీధర్, మాజిద్, చాంద్ పాషా, కుర్ర చైతన్య, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎండి.షోయబ్, ఎర్రమళ్ళ దినేష్, రేబెల్లి లోహిత్, రేబెల్లి శ్రీజ, దోనేటి సైదులు, కోల రామస్వామి, పునాటి లక్ష్మీనారాయణ, కోల నాగరాజు, నూనె రవి, పోగుల నవీన్, నరేందర్, సతీష్, శివ, ఉపేందర్ చాంద్ పాషా, జమీర్, చోటు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.





