Wednesday, March 11, 2026

మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్

నేటి సాక్షి తొగుట వడ్డే నరసింహులుతొగుట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 23.1.2026న నిర్వహించడం జరిగినది.కళాశాల ప్రిన్సిపాల్ గన్నా బాలకిషన్ అధ్యక్షతన పోషకులను విద్యార్థుల ఉద్దేశించి కళాశాలో అందిస్తున్న సౌకర్యాలు అవకాశాల గురించి పోషకులకు వివరించడం జరిగింది . పరీక్షలు సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు బాగా చదువుకోవాలని వివరించారు.స్థానిక కళాకారులు వేంకరావుపేట చెందిన గణేష్ విద్యార్థులకు చదువు గురించి పాటల రూపాన మాటలతో వివరించడం జరిగింది . కళాశాల పేరంటైనా మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు చదువు విద్యార్థుల అవసరాల గురించి వివరించడం జరిగింది.ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నుంచి చంద్రము మరియు షఫీ విచ్చేసి మిలిటరీలో గాని నేవీలో ఉన్న ఉద్యోగాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. స్థానిక పేరెంట్ బంటు స్వామి విద్యార్థులకు విద్యా దశల గురించి వివరించడం జరిగింది.M.J. P. Degree వర్గల్ కళాశాలకు చెందిన అధ్యాపకురాలు కళాశాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పోషకులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News