Sunday, March 8, 2026

కేంద్రం మొండి వైఖరి పై పోరుబాట: ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు. సిఐటియు మండల నాయకులు బచ్చలకూర స్వరాజ్యం.

నేటి సాక్షి, మునగాలమునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కార్మిక సంఘాల ముఖ్య నాయకులు మునగాల మండల సిఐటియు అధ్యక్షులు బచ్చలకూర స్వరాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సోమపంగు జానయ్య కలిసి డాక్టర్ వినయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను చారిత్రాత్మక విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పరిశ్రమల సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నిరసనను గళం వినిపించాలని నాయకులు కోరారు. అలాగేకేంద్ర ప్రభుత్వ ధోరణిపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికులు దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కొమ్ముకాసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వల్ల భవిష్యత్తులో కార్మిక భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక అంశాలను కూడా విస్మరించి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా చట్టాలను సవరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్మికుల ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైందని, హక్కుల రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేశారు. మునగాల మండల వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ ఫిబ్రవరి 12న విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి సమ్మె ఆవశ్యకతను వివరిస్తామని, ప్రతి కార్మిక కుటుంబం ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని, అప్పుడే కార్మికుల ఆకాంక్షలు నెరవేరుతాయని వారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News