నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 27 మండలంలోని ఆమినిగుంట పంచాయతీ పులిహోర వంకలో క్షుద్ర పూజల కలకలం రేపింది, ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు పలు రకాలతో ముగ్గులు నిమ్మకాయతో రక్తం తడిసిన నేల ఇలాంటి గుర్తులు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని క్షుద్ర పూజలతో గ్రామానికి అరిష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు, వాపోతున్నారు ఇటీవల కాలంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుండడంతో పిల్లలు వృద్దులు పిల్ల నుంచి బయటకు రాకుండా బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది అని యానాదులు తెలుపుతున్నారు.





