నేటి సాక్షి అనంతగిరి:సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని బొజ్జగూడెం తండా గ్రామ శ్రీ కోదండరామ స్వామి ఆలయ నూతన కమిటీనీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చైర్మన్ గా ధారావత్ రమేష్,వైస్ చైర్మన్ గా ధారావత్ లచ్చిరాం,ట్రెజరీగా గుగులోతు రవి,కార్యదర్శిగా ధారావత్ ఠాగుర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవాలయ కమిటీ సభ్యులుగా ధారావత్ శంకర్ (మేస్త్రి),భూక్యా మత్రు,ధారావత్ సుక్యా,ధారావత్ సైదులు,మండాన్ బాబు,మండాన్ బాలాజీ,భానోత్ రాజేష్,ధరావత్ సైదులు,భానోత్ సైధా,ధారావత్ బాలాజీ,ధారావత్ సూక్యా,గుగులోతు వస్రాం,ధారావత్ వెంకట్రాం,గుగులోతు హరియా,ధారావత్ వీరన్న,ధారావత్ రాజీవ్,ధారావత్ రామ,భానోత్ కీసు,ధారావత్ కృష్ణా,ధారావత్ వినోద్,భానోత్ రెడ్యా,ధారావత్ నాగేంద్ర,ధారావత్ రాంకోటి,వాంకడోతు గొబ్రీ,ధారావత్ శేఖర్,ధారావత్ రాంప్రసాద్,ధారావత్ రాము,మాళి తులసిరాం,ధారావత్ రామోజీ,భానోత్ హరియ లను ఎన్నుకున్నారు.ఈ చైర్మన్ ధారావత్ రమేష్ మాట్లాడుతూ కోదండరామస్వామి ఆశీస్సులతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రానున్న సీతారామచంద్రస్వామి కల్యాణం కమిటీ సభ్యుల సహకారంతో అంగరంగవైభవంగా నిర్వహిస్తామని అన్నారు.అదేవిధంగా సుమారు70 లక్షల విలువ చేసే 12 కుంటల స్థలాన్ని ఆలయం కోసం దానం చేసిన ఆలయ స్థల దాత మాజీ సర్పంచ్ భానోత్ వెంకటేశ్వర్లు లక్ష్మిభాయి దంపతులు,వారి కుటుంబ సభ్యులకు ఆయన కమిటీ తపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.





