నేటి సాక్షి ఏప్రిల్ 14 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మమంచిర్యాల్ జిల్లా దండేపల్లి మండల రెబ్బెనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలందరికీ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు..ఈ సందర్భంగా రెబ్బనపల్లి గ్రామ ప్రజలు మరియు అంబేద్కర్ సంఘ నాయకులు మా రెబ్బెనపల్లి గ్రామానికి డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహదాత మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, స్పరంచ్లు, ఉప స్పరంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..





