Wednesday, April 22, 2026

*మిషన్ భగీరథ నీటీ సరఫరాలో ఇబ్బందులు రావద్దు*. *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్**అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, రుద్రవరం ఇన్ టెక్ వెల్ పరిశీలన*———————————–సిరిసిల్ల రిపోర్టర్ శివకుమార్ వేములవాడ, ఏప్రిల్ -21:————————————వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ… ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News