Tuesday, March 17, 2026

నరసింహులపేటలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశం – భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంలోకల్–నాన్ లోకల్ తేడా స్పష్టం చేసిన మాజీ మంత్రి రెడ్యానాయక్కాంగ్రెస్ హామీలపై తీవ్ర విమర్శలు – రైతులు యూరియా కోసం అవస్థలురాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి : బీఆర్ఎస్ పిలుపు

నేటి సాక్షి మహబూబాబా ద్ ( భూక్యా రవి నాయక్) డిసెంబర్ 24నరసింహులపేట మండల లో పెద్ద నాగారం ఉమ్మడి జిపి ఆరు గ్రామపంచాయతీలు పెద్దనాగారం స్టేజి లోఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎదురైన లోటుపాట్లను సమీక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, మాజీ డీఎస్ రెడ్యానాయక్ గారు పార్టీ క్యాడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నాయకత్వమే రాజకీయాల్లో విజయానికి మూలమని తెలిపారు. లోకల్ నాయకులు ప్రజల మధ్య ఉండి సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజల నమ్మకం నిలబడుతుందన్నారు. లోకల్, నాన్ లోకల్ నాయకుల మధ్య తేడా ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన రెడ్యానాయక్ గారు, చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆరోపించారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో నిలబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలను పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉందని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం హరస్ పాట లేకపోయినా, పాడి పథకాలు సక్రమంగా అమలు చేయలేకపోతుందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడర్ మరింత బలంగా ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడాలని సూచించారు.రాబోయే ఎంపీటీసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేయాలని, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు అల్లిపురం రవీందర్ రెడ్డి, గుజి వీరస్వామి, అజ్మీర లింగయ్య నాయక్, గాడుదుల కొమురెల్లి ఉప సర్పంచ్ అజ్మీర రవిబాబు, అల్లిపురం జైపాల్ రెడ్డి, నునావత్ రాములు, కొమ్ము పుల్లయ్య, బొబ్బ లింగారెడ్డి, కొమ్ము మధు, కర్ణం శ్రీకాంత్, శాంతమ్మ, ధనమ్మ, నునావత్ జగ్గు, మంగీలాల్, రమేష్, కొమ్ము రఫీ, వీరభద్రం, మహేందర్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News