Friday, March 13, 2026

*బావిలో బాలుడి మృతదేహం లభ్యం** హోలీ ఆడేందుకు వెళ్లి తిరిగి రాని బాలుడు… రేచపల్లిలో విషాదం——*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పవన్ తేజ (10) అనే బాలుడు శనివారం సాయంత్రం బావిలో మృతదేహంగా లభ్యమయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.*హోలీ ఆడేందుకు వెళ్లిన బాలుడు*గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ ఈ నెల 3న హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. అయితే సాయంత్రం అయినా బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం గ్రామ పరిసర ప్రాంతాల్లో బంధువులు, గ్రామస్థులతో కలిసి బాలుడి కోసం గాలింపు చేపట్టారు.*బావిలో తేలిన మృతదేహం*గాలింపు జరుగుతున్న సమయంలో గ్రామ సమీపంలోని ఓ బావిలో బాలుడి మృతదేహం తేలుతూ కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి వివరాలు సేకరించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పవన్ తేజ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు._____________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News