Wednesday, March 11, 2026

*కోరుట్ల వేంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కాపాడండి*——* మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు విన్నవించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్—–*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఎండోమెంట్స్ భూమిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. దేవాలయానికి చెందిన విలువైన భూమిపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ఆలయ ఆస్తులను పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.*దేవాలయానికి చెందిన భూమి ఆక్రమణ*కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్ 1497లో సుమారు 3.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భూమి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆలయ అవసరాల కోసం ఉపయోగపడాల్సి ఉందని పేర్కొన్నారు.అయితే ఈ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేవాలయానికి చెందిన విలువైన భూములపై ఈ తరహా ఆక్రమణలు జరగడం ఆలయ పరిపాలనకు నష్టం కలిగించడమే కాకుండా భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.*పూర్తి స్థాయి సర్వే చేయాలి*ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ మరియు ఎండోమెంట్స్ శాఖ అధికారులతో కలిసి పూర్తి స్థాయి సర్వే నిర్వహించి భూమి సరిహద్దులను స్పష్టంగా గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే డిమార్కేషన్ చేసి ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులను కోరారు.భవిష్యత్తులో దేవాలయ భూములపై మరిన్ని ఆక్రమణలు జరగకుండా తగిన రక్షణ చర్యలు కూడా చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిశీలించి దేవాలయ ఆస్తిని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News