Sunday, April 26, 2026

సిరిసిల్ల రిపోర్టర్ శివకుమార్ ఏప్రిల్ 25:-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల: పత్రికా 25.4.26 ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల గారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25, 2026 ” అనే నినాదంతో మలేరియా అంతం చేద్దాం- ఆరోగ్యమైన (సమాజాన్ని) రేపటి నీ నిర్మిద్దాం” నినాదంతో ముస్తాబాద్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవం అవగాహన కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత గారి అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మలేరియా ను జయిద్దాం- ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేద్దాం అని, మలేరియా అంతం చేసే దిశగా ఇప్పుడు మనం చేయగలం, ఇప్పుడు తప్పక చెయ్యాలి అనే నినాదంతో జాగ్రత్తలతోటే మలేరియా దూరమవుతుందని, మలేరియా నివారణ పాటించవలసిన ముఖ్యమైన చర్యలు ఇళ్లల్లో, పరిసరాలలో నీది నిల్వ ఉండకుండా చూడాలని, నీటి ట్యాంకులు, డబ్బాలు మూత లతో మూసి ఉంచాలని, కొబ్బరి చిప్పలు, కూలర్లు, నీటి నిల్వ తొట్టిలు కనీసం వారమునకు ఒక్కోసారి శుభ్రం చేసుకోవాల్సిందిగా దీని ద్వారా లార్వా వృద్ధి చెందదని, దోమతెరలు వాడాలని, ఇంటి కిటికీలకు మెష్ డోర్లు బిగించాలని, దోమలు పెరగకుండా నివారణ కొరకు మందులు చెల్లించాలని, ఒకవేళ దోమ కాటు వల్ల వణుకు జ్వరం , తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు అలసట అంటే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తపరీక్ష చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలలో విధిగా మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించవలసిందిగా ఆశాలకు, ఏఎన్ఎంలకు సూచించినారు. ఈ సందర్భంగా మనమంతా కలిసి మలేరియా రహిత జిల్లాను నిర్మించాలని, అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమానికి పోతుగల్లు సర్పంచ్ శ్రీమతి యాదమ్మ, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్, డాక్టర్ నహిమ, ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ ఆఫీ జ, డాక్టర్ గీతాంజలి, డిప్యూడెమో రాజ్ కుమార్ మరియు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News