- మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : ఏఐసీసీ,పిసిసి పిలుపు మేరకు జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమ పాదయాత్రలు అమలు చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బై పాస్ రోడ్డలో గల కే కన్వెన్షన్ లో మధ్యాహ్నం నిర్వహించబడునని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇట్టి కార్యక్రమానికి మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.





