నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మున్సిపల్ 2వ వార్డు ధన్నారం లో బోర్ మోటార్ పాడైపోయి ఎన్ని రోజులు అయినా పట్టించుకోని అధికారులు..చివరికి పాత మోటార్ కాలిపోవడం వలన నా గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుంది అని గ్రామస్థుల దాహర్తిని తీర్చడానికి కొత్త మోటార్ తెచ్చి నీటి సమస్య తీర్చిన యువ నాయకుడు చిట్యాల సాయి చరణ్ రెడ్డి అలాగే మైసమ్మ గుడి వద్ద కూడా నీటి సమస్య వుంది అని తెలుసుకొని అక్కడ కూడా మెకానిక్ ను పిలిపించి రిపేర్ చేయించి అక్కడి నీటి సమస్య ను కుడా తీర్చడం జరిగింది..అందుకు గాను సాయి చరణ్ రెడ్డి కీ దాన్నారం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.





