నేటి సాక్షి , గంగాధర: గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ‘అరైవ్ అలైవ’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై వంశీకష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీటుబెల్టు వినియోగించాలని సూచించారు. వాహనాలను నడిపేటప్ప్పుడు మొబైల్ఫోన్లు వాడకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయకూడదన్నారు.





