జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని శనివారం రోజున ఆవుల వెంకటేష్ కుమారుడు ఆవుల అఖిలేష్ ఏడవ పుట్టినరోజు సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో పిల్లలు ఆడుకోవడానికి మానసిక ఉల్లాసంగా ఉండడానికి క్రీడా కిట్ పంపిణీ చేశారు.అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ పిల్లలకి చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమే అని అన్నారు.హాస్టల్ పిల్లలు మరియు టీచర్లు అఖిలేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ పద్మ,శైలజ,జలజ,జ్యోతి రాణి, పి ఈ టి, వనజ,ఆవుల వెంకటేష్ ఆవుల రాజశేఖర్,ఎల్పుల సురేష్ ఎల్పుల ల రాము, మారం తిరుపతి, ఆవుల సాయి బోడపట్ల మధు కొండ మహేష్, తదితరులు పాల్గొన్నారు





