నేటిసాక్షి/ములుగు/మంగపేట ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మల్లూరు గుట్టల్లో వెలసిన హేమచల శ్రీ లక్ష్మి నృసింహ స్వామి చెంచు లక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవార్ల ఆలయం మంగళవారం చంద్రగ్రహణం కారణం చేత ఆరాధన నివేదన చేసి ఉదయం 8.30గంటలకు ఆలయం (బంధనం)ముసివేశారు భక్తుల సౌకర్యం కొరకు రేపు (బుధవారం)తిరిగి శ్రీ లక్ష్మి నృసింహా స్వామి ఆలయం శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామాల రాజశేఖర్ శర్మ తెలిపారు.





