నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 30, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) 140 వ మే డే ను కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ కోరారు. గురువారం మరికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడే సందర్భంగా మరికల్ మండల కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని మేడేను విజయవంతం చేయాలని ఆయన కోరారు.





