నేటి సాక్షి గజ్వేల్:—–గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హునికి అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని 15వ వార్డు కౌన్సిలర్ నక్క సంతోషి రాములు గౌడ్ అన్నారు.శుక్రవారం 15వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ నక్క సంతోషి రాములు గౌడ్ మాట్లాడుతూ…..“15వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ శుభ్రత, తాగునీటి సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను దశలవారీగా చేపడుతున్నాం. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకుంటున్నాం.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదలు, అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, డబుల్ బెడ్ రూమ్, మహిళా సంక్షేమ పథకాలు, విద్యార్థులకు అందే సాయాలు తదితర పథకాల విషయంలో అర్హులు ఎవ్వరూ మిస్ కాకుండా చూస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కార మార్గాన్ని చూపిస్తాం.ప్రజల సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి 15వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం” అని ఆయన పేర్కొన్నారు.అనంతరం వార్డులో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తను వేరు చేయడానికి చెత్త బుట్టలను కౌన్సిలర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను వేరు చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు.మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృపానందం,జోగిని లక్ష్మణ్, భాగమొల్ల మల్లేశం, మంకాళి చంద్రం, బడే సత్యనారాయణ, వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగగా, ప్రజలు కౌన్సిలర్ చేపట్టిన చర్యలకు అభినందనలు తెలిపారు.





