నేటి సాక్షి నారాయణపేట, మే 8, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ, 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ధన్వాడ గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





