నేటి సాక్షి, కరీంనగర్: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కరీంనగర్లోని 54వ డివిజన్ అశోక్నగర్లో టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ ప్రధాన కూడలి వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, తొవిటి శంకరయ్య, జీవీ ఉమారాణి–రమణ, నాంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్, ఎంఐఎం నాయకుడు ఆసిమ్, బీఆర్ఎస్ నాయకుడు ఎండీ యూసుఫ్, డివిజన్ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


