నేటి సాక్షి వికారాబాద్ :
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ లోనీ , కోకా పేట లో,బి ఆర్ ఎస్ పార్టీ మాజీ,ఆర్ధిక శాఖా మంత్రి వర్యులు, తన్నీరు హరీష్ రావ్ గారిని అయన నివాసం( క్రిన్స్ విల్లాస్ )లో, మర్యాద పూర్వకంగా కలిసి, పలు వికలాంగుల సమస్యల గురించి వినతి పత్రం అందజేసిన, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు.ఈ సందర్బంగా కావలి నర్సిములు మాట్లాడుతూ, ప్రధానంగా, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిపెస్టో లో ఇచ్చిన హామీల మేరకు ,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పరిపాలన,2 సంవత్సరాల 6 నెలల కాలం దాటిన కూడా ఆసరా పెన్షన్ ల పెంపు, కొత్త పెన్షన్ లు మంజూరు చెయ్యలేరని మంత్రి హరీష్ రావు దృష్టికీ తీసుకొచ్చారు, అదేవిదంగా ఇందిరమ్మ ఇళ్లల్లో వికలాంగులకు 5 %శాతం రిజర్వేషన్ కల్పించడం లేరని, తెలంగాణ రాష్టంలో సుమారుగా 30 లక్షల మంది వికలాంగులు దుర్భార జీవితాలు గడుపుతున్నారని, ఆసరా పెన్షన్ ల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు.ముఖ్యంగా నడవలేని వారికి 3 వీలర్ మోటార్ బైక్ లు ఇవ్వడం లేరని,ఆవేదన వ్యక్తం చేశారు.బ్యాంకులతో సంబంధం లేకుండా వికలాంగులకు 10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించేలా చూడాలని, అదేవిదంగా 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చెయ్యడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తున్నాయని, మంత్రి హరీష్ రావు దృష్టికీ తెలిపారు.
Telangana
దివ్యాంగుల సమస్యల పరిష్కరించాలి. మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేసిన బీ వీ హెచ్ పీ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు.
Quick Summary:
మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం