నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్. 5
మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో పోలీసులు శుక్రవారం పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నివారణ,మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నా,పేకాటలు,కోడిపందాలు నిర్వహిస్తున్నా 100. కాల్ చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మహిళలు,బాలికల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.ఆడపిల్లలను వేధించే వారు,అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని,అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత గ్రామంగా పందిళ్ళపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద కదిరప్ప. టి సుబ్రమణ్యం. రెడ్డప్ప. రవి. ఏ.సుబ్రహ్మణ్యం. నాగరాజా. ఆర్ సుబ్రహ్మణ్యం. గ్రామస్తులు,యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం
Quick Summary:
పందిళ్లపల్లిలో పోలీసుల విస్తృత అవగాహనా
