నేటి సాక్షి న్యూస్ జూన్ 12
కోసిగి మండలంలో నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని మండల వ్యవసాయ అధికారి ఎం. వరప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (APAIMS) ద్వారా రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులు పంటలకు అవసరమైన మేరకు మాత్రమే నత్రజని ఎరువులు వినియోగించే అవకాశం ఉంటుందని, దీంతో అధిక దిగుబడులు సాధించడంతో పాటు భూమి, గాలి, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు.
జుమ్మాలదిన్నె, దుద్ది, కోసిగి, చిరుతనకల్లు, పెద్ద బొంపల్లి, అగసనూరు, సాతనూరు, వందగల్లు గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో 100 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మిగిలిన రైతు సేవా కేంద్రాలకు కూడా త్వరలో సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ మార్క్ఫెడ్ గోదాముల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పంట అవసరాలను బట్టి యూరియాను రెండు లేదా మూడు దఫాల్లో పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో యూరియా తీసుకున్న రైతులు 20 రోజుల తర్వాత రెండో విడత ఎరువును పొందవచ్చని చెప్పారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు లేదా ఎరువుల దుకాణాల ద్వారా యూరియాను పొందాలని సూచించారు. నూతన విధానంపై రైతులు అవగాహన పెంపొందించుకొని సిబ్బంది, పంపిణీదారులకు సహకరించాలని ఆయన కోరారు.
Andhra
హెడ్లైన్ : నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి
Quick Summary:
నూతన ఎరువుల పంపిణి....
