నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.............................................
కేంద్రీయ విద్యాలయానికి జగిత్యాల రూరల్ మండలం చలిగల్ లో 5 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా అధికారులు సర్వే పూర్తి చేసి సంబందిత పత్రాలను పంపిచ్చినట్లు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ చల్గల్ మండలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం 5 ఎకరాల భూమిని కలెక్టర్ సర్వే చేసి, 10 రోజుల క్రితమే డిప్యూటీ కమిషనర్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు సంబంధిత పత్రాలు పంపించినట్లు వివరించారు.
తాత్కాలిక ఏర్పాటులో భాగంగా పాత ఎస్పీ కార్యాలయాన్ని కేవికి కేటాయించి చిన్న మరమ్మతులు కూడా పూర్తి చేశామన్నారు. జిల్లా ఏర్పడి 9 ఏళ్ల తర్వాత కేంద్రం కేవి మంజూరు చేయడంతో, ప్రజల కోరిక మేరకు స్థల సేకరణ వేగంగా పూర్తి చేశామని ఆయన తెలిపారు.కేంద్రియ విద్యాలయం విషయంలో ఎంపీ అరవింద్ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వైఖరి మారాలని ఎమ్మెల్యే సూచించారు.
కరీంనగర్లో 2011లో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో కేవి ఏర్పడి, 2017లో 7 ఎకరాలకు విస్తరించారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఈ ప్రక్రియలో
సహకరిస్తున్నారన్నారు.
వాలంతరి క్షేత్రం విషయంలో కేంద్రం 2025 ఏప్రిల్ 26న రాసిన లేఖ ప్రకారం, దాన్ని సహజ వ్యవసాయ శిక్షణ కేంద్రంగా మారుస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రియ విద్యాలయానికి 2 ఎకరాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 10 ఎకరాలు కేటాయించారని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాన్ని ఆర్గానిక్ ఫామ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయన్నారు.
వ్యక్తిగత విమర్శలు, దూషణలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన ఎంపీకి విజ్ఞప్తి చేశారు. గతంలో వాలంతరి క్షేత్రంలో పండ్ల వ్యాపారులకు షెడ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, "డబ్బుల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిత్వం తనది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, ఆడువాల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, బీరం రాజేష్,గట్టు సతీష్, కౌన్సిలర్లు నవీన్, ధర్మరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Telangana
*కేంద్రీయ విద్యాలయానికి చలిగల్ లో 5 ఎకరాల భూమి కేటాయింపు* *అధికారుల సర్వే పూర్తి* *కేవి విషయంలో ఎంపీ రాజకీయాలు తగవు* *జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్* ---------------------------------------------
Quick Summary:
*కేంద్రీయ విద్యాలయానికి చలిగల్ లో 5 ఎకరాల భూమి కేటాయింపు*