నేటి సాక్షి ధర్మపురి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు గా ముందుకు..
జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి..
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
కరీంనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి..
జాతీయ పతాక ఆవిష్కరణ.. స్వాతంత్ర్య సమర యోధులకు సన్మానం..
ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంస పత్రాల అందజేసిన మంత్రి అడ్లూరి..
కరీంనగర్:
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అడ్లూరి స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రసంశ పత్రాలను అందజేశారు.
Telangana
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Quick Summary:
జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి..

